మేడారం మహాజాతర ప్రారంభం: గద్దెలపైకి సారలమ్మలు, రేపు సమ్మక్క రాక
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు. నేడు సాయంత్రం 6 గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పోనిగొండ్ల నుంచి పగిడిదరాజును పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. పోనిగొండ్ల ప్రాంతం పెళ్లి వాతావరణాన్ని సంతరించుకుని అంగరంగ…

