జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు – హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్న పిలుపు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటీ నెరవేరలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు ₹2,500, వృద్ధులకు ₹4,000, నిరుద్యోగులకు భృతి, మహాలక్ష్మి పథకం, ఇళ్ల నిర్మాణ హామీలు అన్నీ కేవలం ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ “ఇళ్లను కూల్చివేసి, పేదలను వీధులపైకి నెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం” అని అన్నారు….

Read Full News

నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై వివాదం – పీజీఆర్‌పై “నాన్ లోకల్” వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో పీజీఆర్ గారిని “నాన్ లోకల్” అని వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు దారి తీశాయి.టిజీఆర్ గారి అభిమానులు, తెలంగాణా నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నవీన్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. వారు పేర్కొంటూ – “పీజీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధనీయ నాయకుడు. ఆయనను ‘నాన్ లోకల్’గా అభివర్ణించడం బాధాకరం. రాహుల్ గాంధీ యూపీ నుంచి వచ్చి కేరళలో…

Read Full News

బీసీ 42% రిజర్వేషన్ తీర్పు – ముదిరాజుల ఆవేదన, నాయకులపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై హైకోర్టు తీర్పు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘ నాయకులు తమ వర్గానికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. ముదిరాజుల తరపున సురేష్ గారు మాట్లాడుతూ, ముదిరాజు సమాజం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో కనీస స్థానం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇంద్రసాని తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ పరిమితిని…

Read Full News