ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: మేడారంలో క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ మేడారంలో చారిత్రకంగా 27వ మంత్రివర్గ భేటీ – కీలక నిర్ణయాలు వెల్లడి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 27వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, దాసరి సీతక్కలతో కలిసి మీడియాకు…

Read More

ట్రాఫిక్ చలాన్లపై ఇక డిస్కౌంట్లు లేవు: నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచే వసూలు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకపై ఎలాంటి రాయితీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వకూడదని, చలాన్లు పడిన వెంటనే వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచే నేరుగా జరిమానా మొత్తాన్ని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ కీలక…

Read More

డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. నియామకం రద్దు పిటిషన్ కొట్టివేత

రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యూపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. డీజీపీ…

Read More

రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. జీవో 120పై పునఃసమీక్ష కోరిన ధర్మాసనం

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఇకపై ఎలాంటి మెమోలు జారీ చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది….

Read More

రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు

ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని తిప్పి పంపకూడదు – కఠిన రిఫరల్ సిస్టంపై సర్కార్ కసరత్తు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

Read More

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read More

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు – మంత్రి స్పష్టం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సంబంధిత మంత్రి శాసనసభలో స్పష్టం చేశారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ, హాస్పిటల్స్, నియామకాలు, రిటైర్డ్ ఉద్యోగుల సదుపాయాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విషయంలో ఇప్పటికే కార్డియాలజీ, ఆంకాలజీ వంటి విభాగాల్లో రిఫరల్ హాస్పిటల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న హాస్పిటల్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతపై స్పందిస్తూ, ప్రస్తుతం 11…

Read More

ఈవీ పాలసీతో తెలంగాణ రోల్ మోడల్: 100% టాక్స్ మినహాయింపు, 900 కోట్ల ఆదాయ నష్టం అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం

రాబోయే తరానికి కాలుష్య రహిత భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) పాలసీని తీసుకొచ్చిందని అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరంలోనే లక్షకు పైగా ఈవీ వాహనాలు అమ్ముడైనట్లు సభకు తెలియజేశారు. ఈవీ వాహనాల కొనుగోలుపై 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల…

Read More