తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యత అవసరం.. భావ ప్రకటన స్వేచ్ఛపై తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ హక్కుల పరిరక్షణపై తెలంగాణ జర్నలిస్టుల వేదిక నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ సమావేశాలు, ప్రజా చర్చలు, భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశాలపై వివిధ వర్గాల మధ్య నెలకొంటున్న వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సభలో మాట్లాడిన వక్తలు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాజ్యాంగం కల్పించిన హక్కులు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి సమానంగా వర్తిస్తాయని పేర్కొన్నారు. భావ…

