స్మశానవాటికలో ప్రాజెక్ట్ పనులపై వివాదం… స్థానికుల ఆందోళన, రీడిజైన్ చేయాలని డిమాండ్
హైదరాబాద్లో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్ట్పై కొత్త వివాదం చెలరేగింది. స్మశానవాటిక ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాధులు ఉన్న ప్రదేశాన్ని తవ్వుతూ ప్రాజెక్ట్ పనులు చేపట్టడం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీస్తుందని వారు అంటున్నారు. స్థానికుల ప్రకారం అక్కడ చాలా కాలంగా ఉన్న సమాధులు బయటపడుతున్నాయని, కొన్ని సమాధులు తాజాగా నిర్మించినవే కూడా ఉన్నాయని చెబుతున్నారు. సమాధులపై నిర్మాణాలు చేయడం లేదా విగ్రహాలు ఏర్పాటు చేయడం పూర్తిగా…

