తెలంగాణ మా భూమి పుత్రుల జాగీరు.. అస్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే సహించం” – పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల మండిపాటు
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అనే వ్యాఖ్యపై తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వేలాది మంది త్యాగాలు, ఉద్యమాలు, ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిందని, అందుకే తెలంగాణ భూమి పుత్రులకు ఈ నేలపై ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులు,…

