బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం: బీజేపీ నేత శిల్పా రెడ్డి

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయంటూ ఆమె మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీరు నిలిచిపోవడం, ప్రజలకు ఇబ్బందులు తలెత్తడం ప్రజా ప్రతినిధుల వైఫల్యమని ఆమె పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “గత పదేళ్లుగా ఎక్కడా గణనీయమైన అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది,” అని ఆమె అన్నారు. సనత్ నగర్ నుండి జూబ్లీహిల్స్ వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు.

“ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసిగిపోయారు. బీజేపీ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నిజమైన అభివృద్ధి ఏంటో చూపిస్తుంది,” అని శిల్పా రెడ్డి స్పష్టం చేశారు. అలాగే బీసీ ముఖ్యమంత్రి అంశంపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు.

శిల్పా రెడ్డి మాట్లాడుతూ, “బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే మాటల్లో కాదు, పనుల్లో చూపించాలి. కేవలం ఎన్నికల ప్రయోజనం కోసం హామీలు ఇవ్వడం తగదు,” అని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం వస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి పునరుద్ధరణ తప్పదని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *