మూసాపేట్‌లో ప్రజల కష్టాలు.. నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్త సమస్యలపై ఆవేదన

హైదరాబాద్‌లోని మూసాపేట్ ప్రాంతంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓకే టీవీ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టింగ్‌లో ప్రజలు తమ సమస్యలను వెల్లడించారు. కొన్నేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని చెబుతున్న స్థానికులు నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, చెత్త తొలగింపు, పెన్షన్లు, ఇళ్ల వంటి పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. స్థానికుల ప్రకారం.. మూసాపేట్‌లో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, నీరు వచ్చినా పరిమిత సమయం మాత్రమే వస్తోందని చెప్పారు. నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే…

Read Full News

మోతీనగర్‌లో ప్రజల కష్టాలు.. రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలతో ఇబ్బందులు

హైదరాబాద్‌ మోతీనగర్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, దోమల బెడద, పింఛన్లు, ఇళ్ల సమస్య తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వర్షాలు వస్తే…

Read Full News

బస్తీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. హామీలకే పరిమితమైన ప్రజాపాలన! కార్పొరేటర్‌పై ప్రజల ఆగ్రహం

హైదరాబాద్: బస్తీల్లో మౌలిక వసతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, వర్షం వస్తే నీరు నిలిచిపోవడం, వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు వివరించినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నూతన పైప్‌లైన్ కనెక్షన్ల కోసం రోడ్లను తవ్వి వదిలేయడంతో ఏడాదిన్నరగా రహదారులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై గుంతలు,…

Read Full News

రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో బస్తీవాసుల అవస్థలు.. ఎన్నికల ముందు మాత్రమే నేతల హడావుడి!

హైదరాబాద్‌లోని ఓ బస్తీలో మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నీటి నిల్వలు, మురుగు కాలువల సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల మాటల్లో చూస్తే.. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బస్తీల్లోకి వస్తారు.. ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకునే వారు కనిపించడం లేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిన్నరైనా…

Read Full News

ఎర్రగడ్డలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. ప్రజల ఆగ్రహం: ఎన్నికల వేళ మళ్లీ హామీలేనా?

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్లు, డ్రైనేజీ, నీటి నిల్వలు, పార్కింగ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు, ప్రజాప్రతినిధులు బస్తీల్లో తిరిగి హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం ఎర్రగడ్డ ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో…

Read Full News

ఎర్రగడ్డలో బస్తీ సమస్యలపై ఓకే టీవీ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ పథకాలపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్: నగరంలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ‘బస్తీలలో కుస్తీ’ కార్యక్రమంలో భాగంగా ఓకే టీవీ బృందం ఎర్రగడ్డ డివిజన్‌లో పర్యటించింది. స్థానికులు, మున్సిపల్ సిబ్బంది, బస్తీవాసులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, రేషన్, ఇళ్ల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎర్రగడ్డలో గతంలో ఉన్న కార్పొరేటర్ షీనా బేగం మృతి అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన…

Read Full News

బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం: బీజేపీ నేత శిల్పా రెడ్డి

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయంటూ ఆమె మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీరు నిలిచిపోవడం, ప్రజలకు ఇబ్బందులు తలెత్తడం ప్రజా ప్రతినిధుల వైఫల్యమని ఆమె పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “గత పదేళ్లుగా ఎక్కడా గణనీయమైన అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను…

Read Full News

జూబిలీహిల్స్ షేక్‌పేట్ ప్రజల ఆగ్రహం: “10 ఏళ్లుగా సమస్యలు… ఎవరూ పట్టించుకోలేదు”

జూబిలీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వరదలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కొనసాగుతున్నా, ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్లు చేరి బియ్యం, పప్పులు, గృహసరుకులు పాడైపోతున్నాయని, అయినా అధికారులు స్పందించడం లేదని వేదన వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ — ఎవ్వరూ మా గల్లీ లోకి రాలేదు” అంటూ ప్రజలు ఆగ్రహంగా…

Read Full News

తెలంగాణలో వరదలు–పెద్దమనసు మాటలు vs ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రజల కేకలు ఎవరికి వినిపించాయి?

తెలంగాణలో వర్షాలు పడితే ప్రజల పరిస్థితి ఏమవుతోంది? ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది? ఖమ్మం, మధిర, సూర్యాపేట, కొనిజర్ల మండలం, నెమ్మవాగు వంటి ప్రాంతాల్లో వరదలు తీవ్రమవుతుండగా, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. కొనిజర్ల మండలంలో నెమ్మవాగు వర్షంతో పొంగిపొర్లి ఓ డిసి‌ఎం డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. అక్కడ పోలీస్‌లు బారికేడ్‌లు పెట్టి ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో, ఎక్కడా వైద్య-పోలీస్-రెవెన్యూ యంత్రాంగం కనపడలేదు. స్థానిక ప్రజలే…

Read Full News