సాయిశ్వరాచారి బలి: బీసీ హక్కుల కోసం మరో ఉద్యమ జ్వాల — ప్రభుత్వం మాట మార్చిందా?”

తెలంగాణలో మరోసారి బీసీల ఆవేదన మంటలుగా మారింది.
ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పటిష్ట సంకల్పంతో తన శరీరానికి పెట్రోల్ పోసుకొని బలిదానం చేసిన శ్రీకాంత్ చారి ఘటనను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు, అదే చరిత్రను తలదన్నే విధంగా బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వరాచారి తనను తాను నిప్పంటించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సాయి ఈశ్వరాచారి తన చిన్న పిల్లలు, కుటుంబం ఉన్నా కూడా “బీసీలకు న్యాయం కావాలి” అనే భావంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని నేతలు ఆగ్రహంతో వెల్లడించారు.

నేతల మాటల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది:

“ఇది సాధారణ మరణం కాదు… మాట తప్పిన ప్రభుత్వ హత్య.”

ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసి,
అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలుగా ఆలస్యం చేస్తూ చివరికి కేవలం 17% మాత్రమే ప్రకటించిందని నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ నిర్ణయం కారణంగానే సాయి ఈశ్వరాచారి మనోవేదనతో ఆత్మబలిదానం చేసుకున్నారని వారు తీవ్రంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *