శంషాబాద్‌లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్… కానీ సేవల మెరుగుదలపై ప్రశ్నలు

శంషాబాద్ ప్రాంతంలో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భూ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 18 ఈఎస్ఐసి డిస్పెన్సరీల నిర్మాణానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

కార్మిక శాఖ మంత్రి ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, కార్మికులకు ఆరోగ్య భద్రత అందించడంలో ఈఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ వ్యవస్థ రూపుదిద్దుకోవడంలో బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టి ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు.

అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ లో కార్పొరేట్ స్థాయికి దీటుగా అవయవ మార్పిడి సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.

అయితే కొత్త ఆస్పత్రుల నిర్మాణ ప్రకటనల మధ్య, ఇప్పటికే ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల సేవలపై విమర్శలు వినిపిస్తున్నాయి. చికిత్స కోసం వెళ్లే రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని పలువురు కార్మికులు చెబుతున్నారు. ఓపీ నమోదు నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వరకు ఒకరోజంతా సమయం పట్టడం సాధారణమైందని అంటున్నారు.

అయితే కొత్త ఆస్పత్రుల నిర్మాణ ప్రకటనల మధ్య, ఇప్పటికే ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల సేవలపై విమర్శలు వినిపిస్తున్నాయి. చికిత్స కోసం వెళ్లే రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని పలువురు కార్మికులు చెబుతున్నారు. ఓపీ నమోదు నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వరకు ఒకరోజంతా సమయం పట్టడం సాధారణమైందని అంటున్నారు.

సిబ్బంది కొరత, బెడ్ల లేమి, ఐసీయూ సదుపాయాల లోపం, పరికరాల కొరత వంటి సమస్యలు చాలాచోట్ల కనిపిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఈఎస్ఐ కార్డు ఉన్నప్పటికీ చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని సమాచారం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొత్త ఆస్పత్రుల నిర్మాణం అవసరమే అయినప్పటికీ, ముందుగా ఉన్న ఆస్పత్రుల నిర్వహణ, సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్య సేవల నాణ్యత పెరిగితేనే కార్మికులకు నిజమైన ఆరోగ్య భద్రత కలుగుతుందని వారు సూచిస్తున్నారు.

కొత్త ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం ఎంత వరకు కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది? లేక ముందుగా ఉన్న సమస్యలే కొనసాగుతాయా? అన్నది అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *