సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత..! నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్
సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత.. సామాన్యుడికి పండగ ప్రయాణం భారంగా మారిందా? సంక్రాంతి పండగ వచ్చిందంటే సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈసారి ఆ ఆనందాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పూర్తిగా మింగేశాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పండగ సీజన్ను అవకాశంగా మార్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్.. బస్ టికెట్ చార్జీలను మూడు, నాలుగు రెట్లు కాదు.. కొన్ని రూట్లలో ఐదు రెట్లు వరకు పెంచేశాయి….

