Chandana R

హైదరాబాద్‌లో జాబ్ ఆశతో వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడా? జేజీపీ సొల్యూషన్స్ సీఈఓపై సంచలన ఆరోపణలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు…

Read More

వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై అసైన్డ్ భూముల ఆరోపణలు.. భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం…

Read More

ఫ్లైఓవర్లు కాదు.. చెట్లను కాపాడండి”.. కేబీఆర్ సేవ్ ఉద్యమకారుల ఆవేదన.. సుప్రీంకోర్టు స్టేపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనుల కోసం చెట్ల తొలగింపుపై యువత, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సేవ్ కేబీఆర్” పేరుతో ఉద్యమం చేపట్టిన యువకులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడు విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వాలే ప్రజలకు చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పాల్సిన పరిస్థితి…

Read More

పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read More

బెంగాల్ రాజకీయాలు, హిందుత్వ చర్చలు, తెలంగాణ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు.. గోరక్షకుల వివాదంపై హాట్ డిబేట్

దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, హిందుత్వ రాజకీయాలపై పెరుగుతున్న చర్చలు, మైనారిటీ అప్పీజ్మెంట్ ఆరోపణలు, బంగ్లాదేశ్ సరిహద్దు అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయ పరిస్థితులు వస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై మాట్లాడిన కొందరు రాజకీయ విశ్లేషకులు, అక్కడ బీజేపీ ఎదుగుదల వెనుక హిందూ ఓటర్ల ఐక్యత ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మమతా…

Read More

భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ…

Read More

భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ…

Read More

స్టూడెంట్ల డేటా అమ్మకాలు.. అడ్మిషన్ల దందాలో ప్రైవేట్ స్కూల్లు, కాలేజీల పాత్రపై ఆందోళన

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.రాష్ట్రంలో అడ్మిషన్ల సీజన్ మొదలైతే చాలు… విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్లు ఆగకుండా మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయంటే చాలు… కార్పొరేట్ స్కూల్లు, ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అడ్మిషన్ల పేరుతో పేరెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను డబ్బుల కోసం అమ్ముకుంటున్నారనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఊరు, చదివిన…

Read More

కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీం స్టే.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు…

Read More

పెట్రోల్ ధరలు పెరుగుతాయా..? యుద్ధ ప్రభావంతో సామాన్యుడిపై భారమా..?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మరోసారి చర్చ మొదలైంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, చమురు సరఫరా అంతరాయాలు, ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులతో భారతదేశంపై ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ కొరత వస్తుందా..? ధరలు మరింత పెరుగుతాయా..? అనే భయం సామాన్యుల్లో కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ “పెట్రోల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం తగ్గించండి” అంటూ చేసిన వ్యాఖ్యలు…

Read More