Chandana R

రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ..? నిరుద్యోగుల ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మళ్లీ ఉధృతమయ్యాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత మరోసారి ధర్నాకు దిగింది. గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో…

Read More

అభినవ్ దర్శన్ డ్రామాపై శివశక్తి ఫైర్.. మత మార్పిడులు, పాస్టర్ల రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు

ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివశక్తి నాయకుడు చెట్లపల్లి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభినవ్ దర్శన్‌పై జరిగిన దాడి ఘటన అసలు నిజం కాదని, అది పూర్తిగా ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన వెంటనే ఇది స్కిట్ అని తనకు అర్థమైందని తెలిపారు. దాడి జరిగినట్లు చూపించిన వీడియోల్లో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయని కళ్యాణ్ పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టారని చెబుతూ…

Read More

బీజేపీ జెండాతోనే చావాలి”.. కొత్త పార్టీ ప్రచారంపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ కామెంట్స్‌తో బీజేపీ నాయకుడు బండి సంజయ్ వార్తల్లో నిలిచారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించిన ఆయన, అలాంటి “ఫాల్తూ ఆలోచనలు” తనకు రావని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీపై తనకున్న కమిట్మెంట్‌ను వివరిస్తూ బండి సంజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చచ్చిపోయిన తర్వాత నా మీద బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో…

Read More

కేంద్ర మంత్రి కొడుకు కేసులో ఉచ్చు బిగుస్తుందా?.. కొత్త సెక్షన్లతో జీవిత ఖైదు ఛాన్స్!

కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన సంచలన కేసులో రోజు రోజుకీ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ, తాజాగా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట సరెండర్ చేశాడా లేక పోలీసులు అరెస్ట్ చేశారా అనే అంశంపై వివాదం నెలకొన్నా, చివరకు నిందితుడిని కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపించింది. ఇప్పటికే పలు తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు, తాజాగా మరికొన్ని…

Read More

గో సంరక్షణ కోసం మోతినగర్‌లో భారీ ధర్నా.. బబుల్గూడా గోవుల సంతకు హిందూ సంఘాల వ్యతిరేకత

హైదరాబాద్ మోతినగర్ ఎక్స్ రోడ్ వద్ద గో సంరక్షణ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్, విహెచ్‌పీ, పలు హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బబుల్గూడాలో నిర్వహించబోతున్న గోవుల సంతకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గోవులను అమ్మకానికి తీసుకెళ్లి తర్వాత వాటిని హతమార్చి మాంసం కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోవు హిందూ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం కలిగినదని, గో సంరక్షణ…

Read More

ఆన్‌లైన్ మెడిసిన్ అమ్మకాలపై ఫార్మసీల బంద్.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా?

తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మే 20న డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపుతో అనేక చిన్న పెద్ద మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ మెడిసిన్ సర్వీసులు, భారీ డిస్కౌంట్లు ఇస్తున్న పెద్ద ఫార్మసీ చైన్ సంస్థల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా మెడిప్లస్, అపోలో వంటి పెద్ద ఫార్మసీ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం…

Read More

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం.. బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన డాక్టర్

పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలపై ముప్పుగా మారుతోందన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెలుగుచూసిన ఒక ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాన్పు చేసిన బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఘటన సంచలనం రేపుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన నందిని అనే గర్భిణి గత నెల…

Read More

బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న రమ్య.. సహాయం కోసం కుటుంబం ఆర్తనాదం

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి రమ్య గత నాలుగు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ, వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజల సహాయం కోరుతోంది. రమ్య తల్లి తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా గాంధీ ఆసుపత్రిలో ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం పరిస్థితి…

Read More

మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు

హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు…

Read More

దళపతి నుంచి సీఎం వరకు.. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ముందే ఊహించిన దర్శకుడు వెంకట్ ప్రభు!

తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకుడిగా సంచలనాలు సృష్టిస్తున్న దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొత్త చరిత్ర రాస్తున్నారు. సినిమా స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్, రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తూ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ను ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ప్రస్తుతం ఆ గిఫ్ట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో…

Read More