జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌: బిఆర్ఎస్‌కు సానుభూతి వర్కవుట్ అవుతుందా? కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రణాళికతో గట్టి పోటీ

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్‌ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఈ బై ఎలక్షన్ అవసరమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సానుభూతి తరంగం అధికార పార్టీకి మద్దతు ఇస్తుందనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో సానుభూతి ఫ్యాక్టర్ బిఆర్ఎస్‌కు వర్కవుట్ కాలేదనే వాస్తవం ఇక్కడ కూడా పునరావృతం కావచ్చని…

Read Full News

రాయదుర్గంలో ప్రభుత్వ భూమి ఎకరానికి ₹177 కోట్లు — రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన మరో సంచలన రేటు రాయదుర్గంలో నమోదైంది. ఇటీవల ప్రభుత్వ భూముల వేలంలో ఎకరానికి దాదాపు ₹177 కోట్లకు భూమి అమ్ముడుపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అంటే ప్రతి చదరపు గజం ధర ₹3.75 లక్షలు అన్నమాట! ఈ రేటు హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్ పరిధిలో జరిగిన ఈ వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం,…

Read Full News

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌ — హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం నేడు బీసీ రిజర్వేషన్ల చుట్టూ మండి పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం…

Read Full News

ఎర్రగడ్డలో గేటెడ్ కమ్యూనిటీల మధ్య రోడ్ వివాదం – గ్రేవ్‌యార్డ్ స్థల కేటాయింపుతో ఆగ్రహం వ్యక్తం చేసిన నివాసులు

ఎర్రగడ్డ డివిజన్ సమీపంలోని రెండు ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలు — బ్రిగేడ్ మరియు కల్పతరువు — మధ్యలో ఉన్న రోడ్‌పై ప్రస్తుతం భారీ వివాదం నెలకొంది. ఈ రోడ్ అసలు 50 ఫీట్ల వెడల్పు ఉండి, అందులో 25 ఫీట్ ప్రభుత్వానికి, మిగతా 25 ఫీట్ బ్రిగేడ్ కమ్యూనిటీకి చెందినదిగా పేర్కొనబడింది. రెండు కమ్యూనిటీలు ఈ రోడ్‌ను కామన్ యాక్సెస్‌గా ఉపయోగిస్తూ వచ్చాయి.

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో తుఫాన్‌ – 10 ఎమ్మెల్యేలకు విచారణ, దానం నాగేంద్ర రాజీనామా దిశగా?

తెలంగాణ రాజకీయాలు మరల వేడెక్కుతున్నాయి. రానున్న మే నెల వరకు ఉప ఎన్నికల పరంపర కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Read Full News

శబరిమల ప్రసాదం ఇంటికే – ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం ప్రారంభం

Sabarimala Ayyappa Swamy Temple ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షించే ప్రముఖ యాత్రా కేంద్రం. నవంబర్ నుండి జనవరి వరకు భక్తులు 41 రోజుల దీక్ష పాటించి అయ్యప్ప స్వామి దర్శనం చేస్తారు. ఈ యాత్ర జనవరి 14న జరిగే Makara Jyothi దర్శనంతో ముగుస్తుంది.

Read Full News