News
మీసేవ ఆపరేటర్లపై వేట… చలానా కుంభకోణం నేపథ్యంలో 632 మందికి షాక్
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో వెలుగులోకి వచ్చిన చలానా కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భూసంబంధిత సేవల్లో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేస్తూ 632 మంది మీసేవ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. భూభారతి–ధరణి వ్యవస్థలో చలానాల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 37 కేసులు నమోదు కాగా, సంబంధిత వ్యక్తులపై చర్యలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మీసేవ ఆపరేటర్లపై కఠిన…
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలంటూ లోక్సభలో తీర్మాన నోటీసు… బీజేపీ ఎంపీ దుబే సంచలన డిమాండ్
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. దేశాన్ని తప్పుదారి పట్టించే చర్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ డిమాండ్ చేసినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ విదేశీ శక్తుల ప్రభావంతో దేశ…
అహంకారంతోనే అధికారం కోల్పోయింది బీఆర్ఎస్… ఉద్యమకారుల పట్ల గౌరవం అవసరం: కవిత వ్యాఖ్యలు
కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అహంకార ధోరణి కారణంగానే భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారుల కోసం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోవడం వంటి అంశాలు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపాయని అన్నారు. ముఖ్యంగా ధర్ణా చౌక్ ఎత్తివేయడం, సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు జరగడం…
కౌంటింగ్కు ముందు వివాదం… క్లాత్ ప్యాకింగ్పై అభ్యంతరం, సమాధానం కోరిన అభ్యర్థుల ప్రతినిధులు
స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు వివాదం చోటు చేసుకుంది. కొన్ని వార్డుల బ్యాలెట్ బాక్సులకు క్లాత్ ప్యాకింగ్ ఉండగా, మరికొన్ని బాక్సులకు అది లేకపోవడంపై అభ్యర్థుల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మిగతా వార్డుల బాక్సులకు క్లాత్ ప్యాకింగ్ ఉంది… అయితే మూడో వార్డు బాక్సులకు ఎందుకు చేయలేదు?” అంటూ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చిన తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలని పట్టుబట్టారు. అధికారులు…
సింగరేణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం… కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ
రేవంత్ రెడ్డి సింగరేణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు. సింగరేణి టెండర్లకు సంస్థ ప్రత్యేక మార్గదర్శకాలు తయారు చేయలేదని, 2018లో అమలులో ఉన్న టెండర్ నిబంధనలనే అనుసరించామని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్పై గత పదేళ్ల పాలనలో భారీ బకాయిలు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన, తమ ప్రభుత్వం ఆ సంస్థపై ఒక్క రూపాయి భారం కూడా వేయలేదన్నారు. ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి చర్చకు…
ఆస్తి రాసిచ్చిన తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కూతుర్లు – మారేడిపల్లిలో అమానుష ఘటన
సికింద్రాబాద్లోని మారేడిపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని కూతుర్ల పేరుమీద రాసిచ్చిన తండ్రిని చివరకు ఇంటి నుంచి గెంటేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. మారేడిపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీకి చెందిన మహంకాళి రాజలింగం అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల సంపాదన మొత్తాన్ని ఇద్దరు కుమార్తెలకు రాసిచ్చాడు. వృద్ధాప్యంలో తనను చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తి మొత్తం వారికే బదిలీ చేశాడని చెబుతున్నారు. అయితే ఆస్తి తమ…
నేనే సీఎం… 2029 తర్వాత కూడా నేనే” వ్యాఖ్యలతో రాజకీయ కలకలం – అంతర్గత విభేదాలు, వ్యూహాలపై చర్చ
రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరో ఎనిమిదిన్నర సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ను బులెట్ ట్రైన్ హబ్గా అభివృద్ధి చేస్తానని, ఎన్.టి. రామారావు కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేస్తానని చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్…
15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్… ఉద్యోగులకు శుభవార్త, కానీ జీతాల సమస్యలపై ఆందోళనలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 15 రోజుల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయంలో కే. రామకృష్ణ రావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రత్యేక ప్రధాన…
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం… ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు, జగ్గారెడ్డి కేసు హాట్ టాపిక్
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనుండగా, తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రతతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు….
ఉద్యమం నుంచి రాజకీయాల వరకు… తెలంగాణ ఉద్యమకారుల న్యాయం కోసం వేచి చూస్తున్నాం
2001లో టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఒక కార్యకర్త తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చేరిన ఆయన, కేసీఆర్ పిలుపు ఇచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 2008లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన నిరసనల్లో పాల్గొని బస్సుల ధ్వంసం, ధర్నాలు చేసినందుకు మూడు రోజుల పాటు జైలులో కూడా ఉన్నామని చెప్పారు. తెలంగాణ భవన్లో ఉద్యమకారులను సత్కరించిన రోజులు తమ జీవితంలో మర్చిపోలేని సంఘటనలని…

