News
కేసీఆర్ పేరు వల్ల కాదు, ప్రజా వారసురాలిగా కవితక్క ముందుకు వస్తోంది”నిరాధార ఆరోపణలపై బలమైన కౌంటర్
కవిత అంటే బీఆర్ఎస్, కేవలం కేసీఆర్ ఆస్తి” అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన పిచ్చి మాటలేనని కవిత వర్గం స్పష్టం చేస్తోంది. కొందరు చేతగాని వ్యక్తులు కావాలనే రోజు రోజుకు ఒక ఎపిసోడ్లా ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజలు వాటిని అసలు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. గ్రామస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, ముఖ్యంగా వయసు మీదపడిన పెద్దలు, మహిళలు కవితను చూసి గుండెలకు హత్తుకుంటూ ఆశీర్వదిస్తున్నారని చెబుతున్నారు….
తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని…
తెలంగాణ ఆత్మగౌరవంపై దాడులు సహించంవిగ్రహాల నుంచి ఐడీపీఎల్ భూముల వరకు పోరాటం కొనసాగుతుంది
తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో గాయాలతో ఉన్నారని, ఆ గాయాలపై మళ్లీ పుండు మీద కారం చల్లినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గాయపడ్డ ప్రజలు మార్పు కోసం కొంత శాంతన పొందాలని భావిస్తే, మరింత బాధను మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విగ్రహాల ఏర్పాటు మాత్రమే సమస్య కాదని, అక్రమ పద్ధతుల్లో, అహంకారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీసుకునే నిర్ణయాలే అసలు సమస్య అని స్పష్టం చేశారు. తెలంగాణ…
డీలిమిటేషన్ పేరుతో రాజకీయ ప్రయోగంచట్టబద్ధత లేకుండా బౌండరీస్ – కార్పొరేటర్ సామల హేమ విమర్శలు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, సికింద్రాబాద్ కార్పొరేటర్ సామల హేమ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అనేది సూత్రప్రాయంగా మంచి ప్రక్రియేనని అంగీకరిస్తూనే, ప్రస్తుతం చేపట్టిన విధానం పూర్తిగా చట్టబద్ధత లేకుండా, ఎటువంటి గైడ్లైన్స్ పాటించకుండా జరిగిందని ఆమె విమర్శించారు. డిసెంబర్ 31 డెడ్లైన్ పేరుతో ఒక ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్లు, మ్యాప్స్ ఆధారంగా ఇష్టానుసారంగా బౌండరీస్ ఖరారు చేశారని ఆరోపించారు. ఎలాంటి ఆల్ పార్టీ మీటింగ్,…
కాంగ్రెస్ ఎంపీల మౌనం… విపక్షాలకు కౌంటర్లో వైఫల్యంమంత్రివర్గ విస్తరణలో 11 మంది ఎంపీల పేర్లపై చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 11 మంది ఎంపీల్లో చామల మల్లు మాత్రమే కొంతవరకు యాక్టివ్గా కనిపిస్తున్నారని, మిగతావారి పాత్ర అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, అనిల్ కుమార్ వంటి ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి….
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…
ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన
ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం? “మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని,…
ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ: కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు
ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు హైదరాబాద్లోని కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న భూముల అన్యక్రాంతంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే…
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై హోరాహోరీ: “హైదరాబాద్కు అన్యాయం” అంటూ బీజేపీ నిరసనలు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై వివాదం: “ఇది అభివృద్ధి కాదు, హైదరాబాద్కు అన్యాయం” – బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దాదాపు 300 డివిజన్లుగా విభజన చేసే యోచనపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటాన్ని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వెనుక అభివృద్ధి లక్ష్యం కంటే, ఎంఐఎం కి అనుకూలంగా రాజకీయ లెక్కలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే—“మేము…
ఐబోమ రవికి మరోసారి పోలీస్ కస్టడీ: 12 రోజులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం, మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్
ఐబోమ రవికి మరోసారి పోలీస్ కస్టడీ: 12 రోజులు అనుమతించిన న్యాయస్థానం మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్ – తెలంగాణలో భద్రతా చర్యలు కట్టుదిట్టం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబోమ రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొన్న ఐబోమ రవిని మొత్తం ఎనిమిది రోజుల పాటు…

