ఖైరతాబాద్‌లో పీజీఆర్ వారసత్వం — రాజకీయ సాంప్రదాయాలపై మళ్లీ చర్చ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రముఖ నియోజకవర్గం ఖైరతాబాద్ ఎన్నాళ్లుగానో పేద ప్రజల ఆశలు–ఆకాంక్షలకు కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతానికి పునాది వేసి, పేదలకు అండగా నిలబడి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన నేత పి. జనార్ధన రెడ్డి (పీజీఆర్).

తండాలు, గూడాలు, మారుమూల బస్తీలు…
హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం వచ్చిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన పీజీఆర్, “పేదల దేవుడు”గా పేరుపొందారు.

2007లో పీజీఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా, ఖైరతాబాద్‌తో పాటు మొత్తం హైదరాబాదు ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ సమయంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన సేవలను గుర్తించారు. కాంగ్రెస్‌కు బద్దవైరి అయినా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీజీఆర్ కుటుంబాన్ని గౌరవించడానికి అంగీకరించి, ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపిద్దామని అభిప్రాయపడ్డారు.

ఇలాగే బీజేపీ కూడా పీజీఆర్ కుటుంబానికి అండగా ఉన్నట్లు అప్పటి రాజకీయ నేతలు చెబుతున్నారు. ఇది రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నిలిచింది.

అయితే, ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ పీజీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టిందన్న విమర్శలు వినిపించాయి. రాజకీయ నైతికతను పక్కనపెట్టి అప్పుడు ప్రత్యేక చరిత్ర ఉన్న సాంప్రదాయాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇది ఈరోజు మళ్లీ చర్చకు వచ్చింది.
పీజీఆర్ చేసిన సేవలు, ఆయన ప్రజలతో ఉన్న అనుబంధం, అతని కుటుంబానికి గౌరవంగా నిలవాల్సిన సందర్భంలో జరిగిన ఈ రాజకీయ నిర్ణయం మళ్లీ ప్రజల గుర్తుకు వస్తోంది.

ఖైరతాబాద్ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది —
“పీజీఆర్ లాంటి నేతల నుంచి నేటి నాయకులు విలువలు నేర్చుకోవాలి.”

పీజీఆర్ వారసత్వం నేడు కూడా ఖైరతాబాద్ రాజకీయాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *