Headlines

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల సమ్మె – ఆన్లైన్ ఫార్మసీలపై కెమిస్టుల ఆగ్రహం

దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఔషధ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. ఆన్లైన్ ఫార్మసీలు, ఇన్‌స్టంట్ మెడిసిన్ డెలివరీ యాప్‌లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తోంది. దేశంలో సుమారు 12.4 లక్షల మంది కెమిస్టులు, ఫార్మసిస్టులు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం ఆన్లైన్ మెడిసిన్ ప్లాట్‌ఫాంలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర…

Read More

తెలంగాణలో 7 లక్షల జాబ్ కార్డుల రద్దు – 22 లక్షల మంది కూలీల తొలగింపు

తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలుపై ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో కఠిన నిబంధనలు తీసుకురావడంతో పాటు పథకం లక్ష్యాలను మార్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కూలీలు జాబ్ కార్డుల జాబితా నుంచి తొలగించబడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2019-20 నుంచి 2024-25 వరకు ఆరేళ్ల కాలంలో తెలంగాణలో ఏకంగా 7 లక్షలకు పైగా జాబ్ కార్డులను అధికారులు రద్దు చేశారు. అదే సమయంలో 22.28 లక్షల…

Read More

పెట్రోల్ ధరల పెంపు – ఇథనాల్ బ్లెండింగ్‌పై సామాన్యుడి ఆందోళన

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరోసారి భారీ భారం పడుతోంది. ఇప్పటికే మూడు రూపాయల పెంపు తర్వాత మళ్లీ 90 పైసల వరకు ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం కలిపే విధానాన్ని అధికారికంగా నోటిఫై చేయడం మరో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వస్తుండగా, భవిష్యత్తులో E22, E25, E27, E30…

Read More

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ వివాదం.. “హైదరాబాద్‌ను మరో ఢిల్లీలా మార్చొద్దు” అంటూ యువత ఆందోళన

హైదరాబాద్ నగరంలో “సేవ్ కేబీఆర్” ఉద్యమం రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చెట్లను నరుకుతున్నారనే ఆరోపణలతో యువత, పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కోర్టు 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, వృక్షాలను నాశనం చేయరాదని స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఉద్యమకారులు…

Read More

హైదరాబాద్‌లో జాబ్ ఆశతో వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడా? జేజీపీ సొల్యూషన్స్ సీఈఓపై సంచలన ఆరోపణలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు…

Read More

వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై అసైన్డ్ భూముల ఆరోపణలు.. భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం…

Read More

ఫ్లైఓవర్లు కాదు.. చెట్లను కాపాడండి”.. కేబీఆర్ సేవ్ ఉద్యమకారుల ఆవేదన.. సుప్రీంకోర్టు స్టేపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనుల కోసం చెట్ల తొలగింపుపై యువత, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సేవ్ కేబీఆర్” పేరుతో ఉద్యమం చేపట్టిన యువకులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడు విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వాలే ప్రజలకు చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పాల్సిన పరిస్థితి…

Read More

పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read More

బెంగాల్ రాజకీయాలు, హిందుత్వ చర్చలు, తెలంగాణ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు.. గోరక్షకుల వివాదంపై హాట్ డిబేట్

దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, హిందుత్వ రాజకీయాలపై పెరుగుతున్న చర్చలు, మైనారిటీ అప్పీజ్మెంట్ ఆరోపణలు, బంగ్లాదేశ్ సరిహద్దు అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయ పరిస్థితులు వస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై మాట్లాడిన కొందరు రాజకీయ విశ్లేషకులు, అక్కడ బీజేపీ ఎదుగుదల వెనుక హిందూ ఓటర్ల ఐక్యత ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మమతా…

Read More

భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ…

Read More