Headlines

పోలీసులపై పక్షపాతం ఆరోపణలు… సీఐ సస్పెన్షన్‌కు డిమాండ్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

బడుగు వర్గాల ఐక్యత కార్యక్రమం సందర్భంగా తెలంగాణలో పోలీస్ వ్యవస్థపై పక్షపాతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాల్సిన సమయంలో రాజకీయ ప్రభావం కనిపిస్తోందని విమర్శించారు. 13వ వార్డు ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్ల వ్యవహారం జరిగిందని, వాటిని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఒక చిన్నారి ఘటనను కూడా వక్రీకరించి నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు….

Read More

అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన… నెలల తరబడి జీతాలు లేక 1900 మంది తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నెలల తరబడి జీతాలు అందక దాదాపు 1900 మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.13,600 నుంచి రూ.20,000…

Read More

భట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు?.. ఢిల్లీకి చేరిన నైనీ బొగ్గు వివాదం

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నైనీ బొగ్గు గని వివాదం ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరిందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. సమాచారం ప్రకారం నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో తలెత్తిన వివాదానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కే ప్రధాన కారణమని…

Read More

₹50,000 లోపు సైబర్ మోసాలకు కోర్ట్ ఆర్డర్ లేకుండానే పరిహారం.. బ్యాంకులపై పూర్తి బాధ్యత

డిజిటల్ లావాదేవులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు వంటి పద్ధతులతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వేదికలే ప్రధాన లక్ష్యంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు త్వరగా పరిహారం అందించేందుకు బ్యాంకుల బాధ్యతలను…

Read More

గ్రేటర్ హైదరాబాద్ విభజన… మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, స్పెషల్ ఆఫీసర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనను మరింత వికేంద్రీకరించాలనే లక్ష్యంతో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్ఎండిఏ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా,…

Read More

ముద్రా లోన్ పేరుతో సైబర్ మోసం… వరంగల్‌కు చెందిన ఐదుగురు యువకుల అరెస్ట్

ముద్రా లోన్ ఇప్పిస్తామని చెప్పి మహిళను మోసం చేసిన కేసులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబ్ సెర్చింగ్‌లో భాగంగా సైబర్ నేరస్తులతో పరిచయం ఏర్పడి, చివరికి వారే సైబర్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్స్‌కు సంబంధించిన ప్రకటనను చూసింది. మరుసటి రోజు గుర్తు తెలియని…

Read More

హాస్టల్ సమస్యలపై విద్యార్థినుల ఆందోళన… రాత్రంతా రోడ్లపై ధర్నా, డైరెక్టర్ రాజీనామా డిమాండ్

హాస్టల్‌లో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహంతో విద్యార్థినులు రాత్రంతా రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సుమారు 9 గంటల నుంచి ఉదయం వరకు హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా కొనసాగించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. విద్యార్థినుల వివరాల ప్రకారం, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చినప్పటికీ లోపలికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. హాస్టల్ నిబంధనల్లో పేరెంట్స్‌కు అనుమతి లేదని చెప్పి తిరస్కరించారని ఆరోపించారు. గెస్ట్‌గా వచ్చిన తల్లిదండ్రులకు…

Read More

మూసి పునర్జీవానికి కీలక ముందడుగు… 50 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్, టిడిఆర్ పరిహారంపై సందేహాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్జీవ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసి నది పునరుద్ధరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూములను సేకరించనున్నారు….

Read More

సంగారెడ్డిలో పోలీసులపై దుర్భాషలు… జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీస్ సిబ్బందిపై దుర్భాషలాడారని ఆరోపణలు రావడంతో వివాదం మరింత ముదిరింది. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, హోమ్ గార్డులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో 26 సంవత్సరాలు సేవలందించిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ, విధుల్లో ఉన్న అధికారులను అవమానించే విధంగా మాట్లాడటం బాధాకరమని తెలిపారు….

Read More

ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ దే పైచేయి… మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉండొచ్చని అంచనా వేయబడింది. కాంగ్రెస్‌కు 68 నుంచి 76 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్‌కు 29 నుంచి 36 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది. అలాగే 8 నుంచి 14 స్థానాల్లో గట్టి…

Read More