Headlines

పోలింగ్ కేంద్రంలో పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం… కేసు నమోదు, పలు చోట్ల ఎన్నికల ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై పరుష పదజాలంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ దూషించారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు….

Read More

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా… కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: టౌన్ ఇన్‌స్పెక్టర్

వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వికారాబాద్ పట్టణంలోని 34 వార్డుల్లో ప్రస్తుతం 32 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సిబ్బందితో పాటు అదనపు బలగాలను కూడా వినియోగించి పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని…

Read More

ఎన్నికల వ్యవహారంపై ఆగ్రహం… అధికారులపై అభ్యంతరాలు, దౌర్జన్య ఆరోపణలు

ఎన్నికల నిర్వహణలో అధికారుల వ్యవహారంపై కొందరు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, చెప్పినా స్పందన లేకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏజెంట్ల వ్యవహారం, పోలింగ్ నిర్వహణ, చెక్‌లు, పర్యవేక్షణలో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు సమానంగా అమలు కావాలని, ప్రజల అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాలని స్థానికులు…

Read More

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read More

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read More

ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం… కీలక ఆధారాల భద్రతపై అనుమానాలు

రాష్ట్రంలో వరుసగా నమోదవుతున్న దొంగతనాల కేసుల దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఫారెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా క్లూస్ టీమ్ సేకరించిన కీలక ఆధారాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అగ్నికి ఆహుతయ్యాయా అన్న అంశంపై మూడు రోజులైనా అధికారిక స్పష్టత రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వెలువడకపోవడం వల్ల సందేహాలు మరింత పెరుగుతున్నాయి. వేలాది కేసుల భవిష్యత్ దర్యాప్తు, కోర్టు విచారణపై ఈ ఘటన ప్రభావం…

Read More

రాష్ట్రపతి పరిశీలనలో బీసీ రిజర్వేషన్ బిల్లులు… 42% కోటాపై పార్లమెంట్‌లో కేంద్ర స్పష్టత

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్‌లో బీసీ బిల్లుల ప్రస్తుత స్థితిపై ప్రశ్నించగా, కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇస్తూ ఆ బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ అంశంపై కనీసం అధికారిక స్థాయిలో…

Read More

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం… రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ, 13న ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు జరగనున్న పోలింగ్‌తో ప్రజల తీర్పు వెలువడనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు 52 లక్షల 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 41 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల…

Read More

నారాయణపేట మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై వివాదం… అసలు కారణాలు వెలుగులోకి తేవాలని డిమాండ్

నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల రాజకీయ ధోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నా, అసలు కారణాలను వెలికితీయకుండా రాజకీయ లాభనష్టాల కోసం రోడ్డెక్కి నిరసనలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చే సందర్భాల్లో…

Read More

ఓటు హక్కు వినియోగించుకోండి… అభివృద్ధిని ప్రశ్నించే హక్కు కోల్పోకండి: పట్టణ ప్రజలకు పిలుపు

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారని పేర్కొన్నారు. “మేము ఓటు వేయకపోతే మేము చనిపోయినట్టే” అనే భావనతో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు….

Read More