తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులపై శ్రావ్య ప్రశ్నలు.. “ఇంటికి తాళం వేసినా రూ.13 వేల బిల్లు ఎలా వచ్చింది?”
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ బిల్లుల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందంటూ ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల నెలలుగా సాధారణ వినియోగదారులు, అపార్ట్మెంట్ వాసులు, వాణిజ్య వినియోగదారులకు భారీ మొత్తాల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ, సాధారణంగా రూ.3,500 నుంచి రూ.4,000 మధ్య వచ్చే విద్యుత్ బిల్లు వేసవి కాలంలో రూ.6,000కు చేరిందని, అయితే ఆ తర్వాతి నెలలో ఏకంగా రూ.12,000 నుంచి…

