జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా.. ఏసీబీ దాడుల్లో కళ్లుచెదిరే ఆస్తులు!
హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, భూముల పత్రాలు బయటపడినట్టు సమాచారం. ఏసీబీ…

