కవిత వ్యాఖ్యలపై విమర్శలు.. బీఆర్ఎస్ భవిష్యత్తుపై రాజకీయ చర్చ
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు, నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పార్టీ నిలబడటంలో తన పాత్ర కూడా ఉందని కవిత పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. తాను స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుని ఉంటే పార్టీ పరిస్థితి వేరుగా ఉండేదని ఆమె చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తనపై నమోదైన కేసులు కూడా పార్టీని లక్ష్యంగా చేసుకుని…

