ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు: ట్రెండింగ్ టాపిక్‌లకే పరిమితమైన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు చేసిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ సీరియల్‌లా అంతం లేకుండా…

Read Full News

టిడిపి ప్రస్తావనతో కొత్త రాజకీయ సందేశమా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శల వర్షం

ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. టిడిపిని దెబ్బతీసిన బిఆర్ఎస్‌ను “100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తెలంగాణలో ఆ పార్టీకి స్థానం ఉండకూడదని, గ్రామాల్లో బిఆర్ఎస్ దిమ్మెలు కూలాలని పిలుపునిచ్చిన రేవంత్ మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు టిడిపి ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు…

Read Full News

హరీష్ రావు బీజేపీలోకి జంప్..? బీఆర్‌ఎస్–బీజేపీ పొత్తులపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇటీవల సోషల్ మీడియాలో, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు వేగంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయన తన సొంత బృందంతో కలిసి బీజేపీలోకి జంప్ అవుతారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడలేదు. బీజేపీ నాయకులతో హరీష్ రావు టచ్‌లో ఉన్నారన్న విషయంపై ఇప్పటికే పలుమార్లు అంతర్గత చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో, బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తుపై…

Read Full News

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

Read Full News

కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు….

Read Full News

రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…

Read Full News

తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్రజలు నమ్ముతారా? అనుమానాల మధ్య రాజకీయ ప్రయాణం

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. బంజారాహిల్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు…

Read Full News

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read Full News

కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆశ్చర్యం లేదు..! మంత్రి పదవి రాకపోతే పార్టీకే నష్టం: మాల్రెడ్డి రంగారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యం ఏమీ లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన మాల్రెడ్డి రంగారెడ్డి.. “కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వస్తారని మేము అనుకున్నామా?…

Read Full News

వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా తిరిగొస్తా: బిఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన కవిత, కొత్త పార్టీ సంకేతాలు?

బిఆర్ఎస్ నుంచి ఘోరమైన అవమానాలు ఎదురయ్యాయని, అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా భావోద్వేగంగా మాట్లాడిన కవిత, “వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్తున్నాను.. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా తిరిగి వస్తాను” అంటూ…

Read Full News