కాక్రోచ్ జనతా పార్టీ ధర్ణతో కేంద్రానికేనా షాక్? తెలంగాణ విద్యా వ్యవస్థపై కూడా లేవాల్సిన ప్రశ్నలివే!
హైదరాబాద్: నీట్, సీబీఎస్ఈ పరీక్షల పేపర్ లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఫీజులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్కు చేరుకుంది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్ణా చౌక్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న…

