డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు పిలుపు

దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో 50% సీట్ల పెంపు వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిపితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి కలిపి ఉన్న…

Read More

ఆర్మూర్ రాజకీయాల్లో వేడి పెంచిన ఆరోపణలు: కబ్జా, అవినీతి ఆరోపణలపై నేత ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొదటిసారి మద్దతిచ్చిన జిల్లాగా నిజామాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్న ఓ సీనియర్ నాయకుడు, మళ్లీ అదే ఊపు జిల్లాలో కనిపిస్తోందని అన్నారు. బోధన్‌లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్లు, నిజామాబాద్ అర్బన్‌లోనూ తామే కీలక శక్తిగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే పరిస్థితి పూర్తిగా వన్ సైడ్‌గా ఉందని, టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్)కు…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు: అభివృద్ధి పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, అభివృద్ధి జరగాలంటే బీజేపీకే అధికారాన్ని ఇవ్వాలని భావిస్తున్నారని వారు చెబుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధికి వినియోగించకుండా అవినీతి, అక్రమాలకు దారి మళ్లించారని విమర్శలు గుప్పిస్తోంది….

Read More

ఆర్మూరు ప్రజలకు నిధులు ఇస్తారా? లేక మీ కొడంగల్‌కే పరిమితమా?

ఎన్నికల ముందు ఆర్మూరును గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో హామీలు ఇచ్చారు.ఈ రోజు ప్రశ్న ఒక్కటే — ఆ హామీలు నెరవేరాయా?నిధులు వచ్చాయా?లేదా ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త మాటలతో ప్రచారం చేస్తున్నారా? ఆర్మూరు ప్రజలకు నేను ముందుగా ఇచ్చింది భయంలేని జీవితం.ఒకప్పుడు అక్కడ భయానక వాతావరణం ఉండేది.దాడులు, అక్రమ కేసులు, దళితులపై అణచివేత, మహిళలపై దురాగతాలు —ప్రజలు స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా మరిచిపోయిన పరిస్థితి. ఈ రోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉంది.భయం లేదు, బానిసత్వం…

Read More

జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం

జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. బీజేపీ ఎంపీ అరవింద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన ఓటమి జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భోగా శ్రావణిపై టికెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి….

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

Read More

రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…

Read More

రేహాన్‌ వాద్రా ఎంగేజ్‌మెంట్‌.. గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు

రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి బాజాలుగాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్‌ వాద్రాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో రేహాన్‌,…

Read More

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

రెండేళ్ల విజయోత్సవాల వెనుక బెదిరింపుల రాజకీయం? సహకార ఎన్నికలకు భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరుగుతూ రాజకీయ ప్రచారం చేస్తున్నారని, అదే సమయంలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇందిరమ్మ ఇళ్లు రావు… ఈ పథకం రాదు… ఆ పథకం రాదు” అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని గ్రామ గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నా కూడా నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం…

Read More