ఆర్టీసీ సమ్మె ప్రారంభం: చర్చలు విఫలం… బస్సులు బంద్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అధికారికంగా ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోయాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వం చివరి ప్రయత్నంగా కమిటీ ద్వారా చర్చలు జరిపించినా అవి విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండీతో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు…

