రాష్ట్రం చేసిన అప్పుల వివరాలు ఇవ్వాల్సిందే.. ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల వివరాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. భూములు కోల్పోయిన రైతులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులు, ఉద్యోగులు మనుషులే కదా? ప్రభుత్వం వివిధ పథకాలకు నిధులు కేటాయిస్తున్న సమయంలో, ప్రభుత్వం నుంచి బకాయిలు పొందాల్సిన రైతులు,…

Read Full News

ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా.. అమలే అసలు సవాల్ అంటున్న ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.1.20 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించే ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ప్రముఖ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ వర్గాలు స్వాగతిస్తున్నప్పటికీ, అమలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కార్డులు,…

Read Full News

ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల పరిశీలన.. పెండింగ్ బిల్లులపై సర్కార్ హామీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎస్ K. Ramakrishna Rao తెలిపారు. అలాగే జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో,…

Read Full News

ఆర్టీసీ సమ్మె ప్రారంభం: చర్చలు విఫలం… బస్సులు బంద్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అధికారికంగా ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోయాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వం చివరి ప్రయత్నంగా కమిటీ ద్వారా చర్చలు జరిపించినా అవి విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండీతో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు…

Read Full News