ఉపాధి హామీలో ఫేక్ హాజరు దందా? ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆరోపణలు.. ఫేస్ ఐడీ వ్యవస్థలోనూ లోపాలు!

ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఫోటో హాజరు, ఈ-కేవైసీ, ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వంటి ఆధునిక వ్యవస్థలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫేక్ హాజరు నమోదు చేసి కూలీల డబ్బులు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి రాని వ్యక్తులకు కూడా హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వచ్చిన కూలీలతో కుమ్మక్కై వారి పేర్లపై వచ్చిన కూలి డబ్బులను పంచుకుంటున్నారనే ఆరోపణలు స్థానికంగా…

Read More

తెలంగాణలో 7 లక్షల జాబ్ కార్డుల రద్దు – 22 లక్షల మంది కూలీల తొలగింపు

తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలుపై ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో కఠిన నిబంధనలు తీసుకురావడంతో పాటు పథకం లక్ష్యాలను మార్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కూలీలు జాబ్ కార్డుల జాబితా నుంచి తొలగించబడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2019-20 నుంచి 2024-25 వరకు ఆరేళ్ల కాలంలో తెలంగాణలో ఏకంగా 7 లక్షలకు పైగా జాబ్ కార్డులను అధికారులు రద్దు చేశారు. అదే సమయంలో 22.28 లక్షల…

Read More

ఉపాధి హామీపై కేంద్ర బిల్లు పిడికిలి: తెలంగాణపై ఏటా ₹1,733 కోట్ల అదనపు భారం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌రేగా) విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్పులు తెలంగాణ రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం మోపనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం, ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు ₹1,733.90 కోట్ల అదనపు భారం భరించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వమే 100 శాతం చెల్లిస్తోంది. అలాగే…

Read More