మృగశిర కార్తె చేప ప్రసాదం నేడు ప్రారంభం.. లక్షలాది ఆస్తమా బాధితుల రాకకు భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మృగశిర కార్తె చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆస్తమా మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభం కానుంది. కార్యక్రమం నిరవధికంగా 24 గంటల పాటు కొనసాగనుండగా, అనంతరం దూద్బౌలిలోని బత్తిన కుటుంబ నివాసంలో మరో మూడు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది….

