కుత్బుల్లాపూర్లో దేవాలయ భూముల వివాదం.. వైష్ణవి మాత ఆలయ ట్రస్ట్కు న్యాయం ఎప్పుడు?
హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఉన్న శ్రీ జై వైష్ణవి దేవి నవదుర్గా దేవాలయం భూముల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై ఇప్పుడు యాజమాన్య వివాదం కొనసాగుతుండటంతో ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ ప్రతినిధుల వివరాల ప్రకారం, 1998-2000 కాలంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గాజులరామారంలో సుమారు 10 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు. అనంతరం…

