తెలంగాణలో మైనింగ్ మాఫియా దందా.. వేల కోట్ల అక్రమాలపై సంచలన ఆరోపణలు
తెలంగాణలో మైనింగ్ మాఫియా దందాపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గ్రానైట్, ఇసుక, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రముఖ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ రవాణా జరిగినట్లు…

