హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ల దందా.. నీటి కొరతను ఆసరాగా చేసుకుని వేల కోట్ల వ్యాపారం?

హైదరాబాద్ నగరంలో ప్రతి వేసవికాలం రాగానే నీటి కొరత సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న ప్రైవేట్ ట్యాంకర్ నిర్వాహకులు భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాటర్ బోర్డు ద్వారా 5,000 లీటర్ల నీటి ట్యాంకర్ సుమారు రూ.500కే అందుబాటులో ఉండగా, ప్రైవేట్ ట్యాంకర్లు అదే పరిమాణం నీటికి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1,500కు పైగా ప్రైవేట్ ట్యాంకర్లు రోజుకు 6,000…

Read More

హైదరాబాద్‌కు గ్రౌండ్ వాటర్ డేంజర్ బెల్.. భూగర్భ జలాలను పీల్చేస్తున్న బోర్లు!

హైదరాబాద్ నగరానికి భూగర్భ జలాల విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్‌మెంట్ నివేదిక ప్రకారం నగర పరిధిలో భూగర్భ జలాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని వెల్లడైంది. అధికంగా బోర్లు తవ్వడం, విచ్చలవిడిగా నీటిని తోడేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాలు ఆందోళనకర పరిస్థితిలో ఉన్నాయి….

Read More