ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడంతో రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు కాకపోవడంతో రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రత్యేకంగా యూరియా కొరత, టోకెన్ వ్యవస్థలో గందరగోళం, కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట పండించేందుకు ఎండలోనూ, వర్షంలోనూ కష్టపడి వ్యవసాయం చేసిన రైతులు చివరికి ధాన్యం అమ్ముకునే…

