మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అనాశక్తి: క్షేత్ర స్థాయికి దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం?
తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల అనాశక్తి, క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, లోక్సభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలుగా నియమించిన మంత్రుల్లో సగం మంది ఇప్పటికీ ఫీల్డ్లోకి అడుగుపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై…

