కవిత కొత్త పార్టీ ఆవిర్భావం: తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది ni
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునిరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేసి పార్టీ పేరుతో పాటు జెండా, అజెండాను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తుండటంతో సభ ప్రాంగణం రాజకీయ ఉత్సాహంతో కళకళలాడుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కవిత…

