హరీష్ రావు సంచలన ఆరోపణలు: ‘మట్టి కుప్పలపై బొగ్గు పోసి మోసం చేస్తున్నారు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పరిశీలనకు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న అధికారులు, వాస్తవ పరిస్థితులను దాచిపెట్టేందుకు మట్టి కుప్పలపై బొగ్గును పరచి చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. “నేను ఇక్కడికి వస్తానని నాలుగు, ఐదు రోజుల ముందే వారికి సమాచారం చేరింది. నేను వచ్చి చూస్తానని తెలుసుకుని బయట ప్రాంతాల నుంచి బొగ్గును తెప్పించి ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి కుప్పలపై…

