రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పగలవా? రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సవాల్
తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై రాజకీయ వేడి మరింత పెరిగింది. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ప్రభుత్వ వాదనలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రైతులకు మూడు గంటల కరెంట్ చాలని వ్యాఖ్యానించారని, తాజాగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని అధికారిక వేదికపై వ్యక్తం చేశారని ఆరోపించారు. ఈఆర్సీ (విద్యుత్ నియంత్రణ కమిషన్) ముందు జరిగిన…

