10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం.. రైతులకు క్షమాపణ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం తరఫున మంత్రి క్షమాపణ చెప్పారు. ఈసారి అంచనాలకు మించి ధాన్యం రావడంతో సమస్యలు తలెత్తాయని, రైతులు గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు….

Read More

ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆగ్రహం.. మార్కెట్ యార్డులో అధికారులను నిలదీసిన రైతులు

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, మార్కెట్ యార్డుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని మార్కెట్ యార్డులో రైతులు అధికారులను నిలదీస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. “రైతులు పంట పండించడానికి ఆరు నెలలు కష్టపడతారు.. ఇప్పుడు వర్షాలు పడితే ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉంది.. ఇంకో నెల రోజులు వేచి చూడమంటారా?” అంటూ రైతులు అధికారులను ప్రశ్నించారు. మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా…

Read More

నెల రోజులుగా ధాన్యం కొనలేదు.. రైతుల గోడు వినని అధికారులు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి. నెల రోజులుగా ధాన్యం తీసుకొచ్చి పెట్టినా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ పెట్రోల్ ఖర్చులు, భోజన ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. “30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కాంటాలు వేయడం లేదు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చోవాల్సి వస్తోంది. టిఫిన్, నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. వానలు వస్తే మా…

Read More