ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయా? ఆర్బీఐ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ట్రయల్ ప్రింటింగ్‌కు సిద్ధం

దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల మన్నికను మరింత పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాలిమర్ (ప్లాస్టిక్ ఆధారిత) కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రారంభ దశలో ₹10, ₹20 నోట్లను ట్రయల్ ప్రాతిపదికన ముద్రించి క్షేత్రస్థాయిలో పరీక్షించనున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కో డినామినేషన్‌కు 100 కోట్ల చొప్పున…

Read Full News

మరోసారి భారీ అప్పుల బాటలో తెలుగు రాష్ట్రాలు.. మేలో తెలంగాణకు ₹4000 కోట్లు, ఏపీకి ₹4400 కోట్ల రుణం

మరోసారి భారీ అప్పుల బాటలో రెండు తెలుగు రాష్ట్రాలు నడుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల రుణాలు సమీకరించనున్నాయి. మే నెలలో తెలంగాణ ప్రభుత్వం ₹4000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹4400 కోట్ల అప్పులు తీసుకోనున్నట్టు ఆర్బిఐ విడుదల చేసిన వివరాల్లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు విడతల్లో ₹2200 కోట్ల చొప్పున మొత్తం ₹4400 కోట్ల రుణం తీసుకోనుంది….

Read Full News

మ్యూల్ ఖాతాలపై కఠిన చర్యలు అవసరం – ఆర్బిఐకి సీపీ సజ్జనార్ లేఖ

సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో తక్షణ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరవబడుతున్న బ్యాంక్ ఖాతాల KYC వెరిఫికేషన్‌లో బ్యాంక్ సిబ్బంది…

Read Full News