బోయినపల్లి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన.. బాధితులకు న్యాయపోరాటం చేస్తామని హామీ
బోయినపల్లి ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాల గృహ సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తామని ప్రకటించిన భూమి ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందని ఆరోపిస్తూ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, బోయినపల్లిలో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో 6,000 ఇంద్రమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తులు హక్కులు చెలాయిస్తున్నారని,…

