హైకోర్టు తీర్పుతో ఇరుక్కున్న ఎన్నికల సంఘం – బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరుక్కున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు తన ఆదేశాల్లో రిజర్వేషన్లు 50% మించకూడదని స్పష్టం చేస్తూ, ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియను ఆపే ఉద్దేశం లేదని పేర్కొంది. బీసీలకు అదనంగా ఇచ్చిన 17% రిజర్వేషన్లు తగ్గించి, పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. ఈ…

