జెన్‌జీ నిరసనలు.. ముందు వినండి, తర్వాత నచ్చజెప్పండి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. యువత నిరసనలను ఎదుర్కొనే సమయంలో ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలు బలప్రయోగం కంటే సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువత ఏమి చెప్పాలనుకుంటుందో ముందుగా వినాలని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని, అదే హింసను నివారించే అత్యంత శక్తివంతమైన మార్గమని న్యాయస్థానం అభిప్రాయపడింది. యువత నిరసనల సందర్భంగా జరిగిన ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ…

Read Full News

నీట్ లీకేజీ నిరసనలు: మైనర్ విద్యార్థుల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం.. రాష్ట్రాలకు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరిగిన నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనల్లో పాల్గొని అరెస్టు లేదా నిర్బంధానికి గురైన మైనర్ విద్యార్థులు, అలాగే నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై అనవసరంగా కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నీట్ లీకేజీకి…

Read Full News

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానాకు క్యాబినెట్ ఆమోదం

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తులో పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్ట సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రశ్నపత్రాల లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించడంతో పాటు కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల ప్రకారం, పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల…

Read Full News

చిన్న స్పెల్లింగ్ తప్పులతో పౌరసత్వం తిరస్కరించొద్దు: 27 మందికి సుప్రీంకోర్టు ఊరట

చిన్న తప్పులతో పౌరసత్వం నిర్ణయించరాదు: సుప్రీంకోర్టు పౌరసత్వం వంటి అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కును నిర్ణయించే విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత ఓటర్ల జాబితాలో పేర్ల స్పెల్లింగ్ లేదా టైపింగ్ దోషాల ఆధారంగా అస్సాంకు చెందిన 27 మందిని విదేశీయులుగా ప్రకటించిన నిర్ణయాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసులను మళ్లీ విచారణ జరపాలని సంబంధిత ఫారినర్స్ ట్రిబ్యునళ్లకు…

Read Full News

మీనాక్షి నటరాజన్‌కు కోర్టుల్లో షాక్.. రాజ్యసభ నామినేషన్ వివాదం రాజకీయ దుమారం

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు వరుసగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగలడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అనర్హమని పేర్కొంటూ కొట్టివేయగా, మరోవైపు నాంపల్లి కోర్టు కూడా ఇదే అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం తీరుపై, రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాలపై తీవ్ర చర్చ మొదలైంది….

Read Full News

గ్రహిణుల శ్రమ అమూల్యం.. నెలకు రూ.30 వేలకు పైగానే విలువ: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

దేశంలోని కోట్లాది మంది గృహిణుల శ్రమకు గౌరవం దక్కేలా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇంటి పనులు చేసే మహిళలు కేవలం కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవిస్తున్నారనే సామాజిక భావన పూర్తిగా తప్పని స్పష్టం చేస్తూ, గృహిణుల సేవలకు ఆర్థిక విలువ ఉందని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. ఒక కుటుంబం సజావుగా నడవడంలో గృహిణి పాత్ర అమూల్యమని పేర్కొన్న సుప్రీంకోర్టు, ప్రమాదవశాత్తు ఒక గృహిణి మరణిస్తే ఆమె అందించే సేవలను ద్రవ్య…

Read Full News

న్యాయం కోసం పోరాటం కొనసాగుతుంది: సుప్రీంకోర్టు, ప్రధాని మోదీకి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి”

భారత సుప్రీంకోర్టు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి శ్రీ సూర్యకాంత్ గారికి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారికి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి చేశారు. భారత యువతను గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై నిషేధానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీని వల్ల కోట్లాది మంది…

Read Full News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం.. బీజేపీకి రాజ్యసభ సీటు అప్పగించేందుకే రాజకీయ గేమ్?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించగా, మరోవైపు బీజేపీ అభ్యర్థులు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల వివరాలను నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు….

Read Full News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: తెలంగాణ నుంచి సమాచారం లీకైందా? సుప్రీంకోర్టుకు కాంగ్రెస్, రాజకీయంగా కొత్త అనుమానాలు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యవసర విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ వాదన ప్రకారం, మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో నామినేషన్‌ను తిరస్కరించడం చట్టబద్ధం కాదని పార్టీ అభిప్రాయపడుతోంది. అంతకుముందు కాంగ్రెస్…

Read Full News

కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీం స్టే.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు…

Read Full News