తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రమాణ స్వీకారం.. రాజ్యాంగ నిబద్ధతతో సేవ చేస్తానన్న సీఎం
తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ శాసనసభలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాజ్యాంగ నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ ప్రారంభంలో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన తాత్కాలిక స్పీకర్, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులుగా సభకు వచ్చిన సభ్యులందరూ తమిళ ప్రజలకు సేవ చేయడం తమ ప్రధాన బాధ్యత అని…

