కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు – పార్టీ ఫిరాయింపుల కేసు విచారణపై ఉత్కంఠ

పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్‌ గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ స్వయంగా విచారణ జరపనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్, గూడె మహిపాల్…

Read Full News

జగిత్యాల అభివృద్ధే లక్ష్యం: పార్టీ ఏదైనా ప్రభుత్వంతో కలిసి పని చేస్తా – ఎమ్మెల్యే స్పష్టం

జగిత్యాల పట్టణ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని, పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసిన అనేక మందికి రావాల్సిన బిల్లులు, హక్కులు ఇప్పించానని, అవసరమైతే భవిష్యత్తులో కూడా ఎవరు సహకారం కోరినా వెనకాడనని ఆయన తెలిపారు. రాజకీయాల్లో పార్టీ మారడం కొత్త కాదని పేర్కొన్న ఎమ్మెల్యే, పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని గుర్తు…

Read Full News

అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీరు వివాదాస్పదం: న్యూట్రాలిటీపై రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్పీకర్ న్యూట్రల్‌గా వ్యవహరించాల్సిన సందర్భంలో ఆయన తీరు ఒక పక్షానికే అనుకూలంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేల…

Read Full News

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read Full News

అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై విశ్లేషణ

అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయ విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు ఈసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర, ముఖ్యంగా బీఆర్‌ఎస్ వైఖరి రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో “ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తా” అనే వ్యాఖ్యలు…

Read Full News

అసెంబ్లీ బాయికాట్‌తో లాభం ఎవరికీ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పవర్ పాయింట్ రాజకీయంపై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా ప్రశ్నించడం లేదని తాను అనట్లేదని, కానీ బీజేపీతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువగా గ్రౌండ్‌లో తిరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా ప్రశ్నించవచ్చని సూచించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయికాట్ చేయడాన్ని ఆయన సమర్థించినా, ఆ తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడమే పెద్ద తప్పు అని విమర్శించారు. ఒకరోజు నిరసన…

Read Full News

అసెంబ్లీలో ప్రశ్నించే హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం: ప్రతిపక్షాల పాత్రపై కీలక వ్యాఖ్యలు

ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ఎత్తయితే, అసెంబ్లీలో అధికారికంగా ప్రశ్నించడం మరొక ఎత్తని వ్యాఖ్యానించారు ఓ రాజకీయ విశ్లేషకుడు. అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు తప్పనిసరిగా ఉండాలని, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు ఈ హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను యావత్ దేశం గమనిస్తుందని, అక్కడ పాస్ అయ్యే బిల్లులే చట్టాలుగా మారతాయని గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తారని తెలిపారు. నిరుద్యోగులు, పెన్షన్…

Read Full News

పల్లవి విల్ల రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పు సాధ్యం కాదు: సభలో ప్రభుత్వ స్పష్టీకరణ

పల్లవి విల్ల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రోడ్ వైడనింగ్ అంశాన్ని గౌరవ సభ్యులు హరీష్ బాబు శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌పై ఆలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒక వైపు డిఫెన్స్ ల్యాండ్, మరో వైపు సరస్సు ఉండటంతో ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఈ రోడ్ అలైన్‌మెంట్ అంశాన్ని గతంలోనే పలుమార్లు పరిశీలించామని స్పష్టం చేసింది. అయితే ఒక వైపు…

Read Full News

బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బీసీ సంక్షేమంపై సభలో స్పష్టత

బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, కేటాయించిన బడ్జెట్ అమలుపై ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం సభలో స్పష్టత ఇచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించి రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పటివరకు సుమారు రూ.2400 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, మిగిలిన నిధుల వినియోగానికి అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విదేశీ విద్య పథకానికి సంబంధించి గత ప్రభుత్వాల హయాంలో కేవలం 300 మందికే అవకాశం ఉండేదని, ప్రస్తుత…

Read Full News

42% బీసీ రిజర్వేషన్‌పై రాజకీయ మౌనం.. కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీపై ఐలీ వెంకన్న తీవ్ర విమర్శలు

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారుతోంది. అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చలు జరిగినప్పటికీ, బీసీ రిజర్వేషన్‌పై కనీసం ఐదు నిమిషాలు కూడా చర్చ జరగకపోవడం వెనుక కుట్ర ఉందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు ఐలీ వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూడు పార్టీలు కుమ్మక్కయ్యే బీసీ అంశాన్ని డైవర్ట్ చేశాయని ఆయన విమర్శించారు. శీతాకాల సమావేశాల్లో బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక చర్చ…

Read Full News