కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read Full News

నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

Read Full News

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ…

Read Full News

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలలో అత్యంత ముఖ్యమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని అభివర్ణిస్తూ, ఈ పథకం వల్ల పేదలు, బడుగు–బలహీన వర్గాలు, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, రెండు మూడు లైట్లు, ఒక ఫ్యాన్‌తోనే జీవనం సాగించే కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. గృహజ్యోతి పథకం అమలుతో…

Read Full News

తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశం: పబ్లిక్ సర్వీసెస్, పంచాయతీరాజ్ సవరణలపై చర్చ

తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశం: పబ్లిక్ సర్వీసెస్, పంచాయతీరాజ్ సవరణలపై చర్చ తెలంగాణ శాసనసభలో మంగళవారం కీలక బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. ది తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ అమెండ్మెంట్ బిల్–2026 (ఎల్‌ఏ బిల్ నంబర్ 6 ఆఫ్ 2026)తో పాటు, అదే అంశానికి సంబంధించిన సెకండ్ అమెండ్మెంట్ బిల్–2026 (ఎల్‌ఏ బిల్ నంబర్ 7 ఆఫ్ 2026)లను సభ ముందుకు…

Read Full News

ప్రతిపక్ష గొంతు నొక్కేలా శాసనసభ నడుస్తోంది – స్పీకర్, సీఎం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ బహిష్కరణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు శాసనసభలో వినిపించాలని ఆశతో ఎదురు చూస్తుంటారని, ఆ బాధ్యతను ప్రతిపక్షం ద్వారా నెరవేర్చాలని అనేక వర్గాల ప్రజలు వినతులు ఇస్తుంటారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రజల గొంతును అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయాల్సిన శాసనసభ రోజు రోజుకు దిగజారిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పక్క రాష్ట్రాల శాసనసభల తీరును చూసి మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తోందని గర్వపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష గొంతు నొక్కుతూ అధికార…

Read Full News

శాసనసభ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తోంది – స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనసభ సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, శాసనసభలో అమలు చేస్తున్న అజెండాకు ఏమాత్రం పొంతన లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. BACలో ఏడు రోజుల పాటు అసెంబ్లీ నడపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, సభలో మాత్రం “ఎన్ని…

Read Full News

మూసీ ప్రక్షాళనకు టైమ్‌లైన్ కావాలి: అసెంబ్లీలో గట్టిగా వినిపించిన డిమాండ్

హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది ప్రక్షాళన అంశం మరోసారి అసెంబ్లీలో ప్రధాన చర్చగా మారింది. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించారని, అప్పట్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా ఉన్న జైస్ రంజన్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రణాళిక సిద్ధం చేసిన ఘనత దక్కుతుందని సభ్యులు గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ ‘కోల్డ్ స్టోరేజ్’లో పడిపోయిందని,…

Read Full News

కృష్ణా జలాలు, అసెంబ్లీ అజెండా, మున్సిపల్ ఎన్నికలు: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. కృష్ణా జలాల అంశం, అసెంబ్లీ సమావేశాల అజెండా, అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తాజాగా జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ అజెండాపై బీఏసీ సమావేశం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో కృష్ణా జలాల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా పీపీటీ ద్వారా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరాయి. అసెంబ్లీని కనీసం 15 రోజులు…

Read Full News

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10:29 గంటలకు కేసీఆర్ శాసనసభలోకి ప్రవేశించగా, ఒక్క నిమిషం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. తన సీటు…

Read Full News