కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు రూ.8.11 లక్షల కోట్లకు చేరింది.. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో వదిలారు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం భారీ అప్పుల్లో ముంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృతంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణపై కేవలం రూ.69 వేల కోట్ల అప్పు మాత్రమే ఉండేదని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో…

