అసెంబ్లీ రచ్చపై తీవ్ర విమర్శలు.. ప్రజా సమస్యల కోసం సభకు రారా?
హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అసెంబ్లీ సమావేశాలు రాజకీయ రచ్చకు వేదికగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ అనేది పార్టీ సమావేశం కాదని, ప్రజల తరఫున తమ వాణిని వినిపించాల్సిన అత్యంత కీలక వేదిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని…

