పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై హైకోర్టు ఆగ్రహం.. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలను సీజ్ చేస్తున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పోలీసు శాఖను ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు తన బైక్ను సీజ్ చేశారని ఓ బాధితుడు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర హోమ్ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్లకు నోటీసులు…

