ఫ్రీ బస్సులు కాదు.. రైతుకు గిట్టుబాటు కావాలి”.. ప్రభుత్వంపై మహిళా రైతు ఆగ్రహం
తెలంగాణలో రైతుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ మహిళా రైతు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “వేల రూపాయలు ఖర్చు చేసి పంట పండించాం. కానీ వర్షాలతో వడ్లు మురిగిపోతున్నాయి. రాత్రంతా తల పట్టుకుని కూర్చుంటున్నాం” అంటూ ఆమె బాధను వ్యక్తం చేసింది. పండించిన ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…

