మహిళలకు ₹2500 ఎక్కడ?.. రైతులకు మోసమే”.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళ ఆగ్రహం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందంటూ ఓ మహిళ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహిళలకు ₹2500 ఆర్థిక సాయం, రైతులకు మద్దతు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు వంటి హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని మండిపడింది. “మహిళలకు ₹2500 ఇస్తామని చెప్పారు. తులం బంగారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. మాటలు మాత్రమే చెప్పారు కానీ అమలు లేదు”…

